Reseña del libro "Kattela Poyyi (en Telugu)"
సాహిత్యకారుల లక్ష్యం పీడితుల పక్షాన నిలబడటమే అవ్వాలి. జాతి వివక్ష, కుల- మత గోడలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లాంటి అసమానతలు సమాజంలో రాజ్యమేలుతున్నాయి. వాటిని రూపుమాపేందుకు కవులు, రచయితలు సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరమున్నది. సాహిత్యం ప్రజలను చైతన్యపరచాలి, బంధాల విలువలను తెలియజేయాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, అక్రమాల మీద తిరుగుబాటు చేయాలి. అలా చేయలేని సాహిత్యం ప్రజలను పురోగమనం వైపు నడపలేదు. ప్రజలను పురోగమనం వైపు నడిపించలేని సాహిత్యం ఎడారి లాంటిది. సాహిత్యం ఎడారిలా కాకుండా నదిలా, పచ్చని అడవిలా ఉండాలి. అలాంటి కథలే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇందులోని ప్రతి కథ పీడితుల, బాధితుల పక్షాన నిలబడుతుంది. కులాన్ని, మతాన్ని, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూనే వాటి కంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు, అనుబంధాలు ముఖ్యమని చెప్పడమే ఈ పుస్తకంలోని కథల ముఖ్య ఉద్దేశం.